నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న యాజమాన్యం
- శ్రీ చైతన్య పాఠశాలలో 8,9,10 తరగతులకు పరిమిషన్ లేవు.
- చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ..
- అకాడమీక్ పూర్తవుతున్న చర్యలు శూన్యం..
- ఆందోళనలో తల్లిదండ్రులు..!
- అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 03 (లోకం తీరు ) : శ్రీ చైతన్య స్కూల్లో 8.9.10 తరగతులకు పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవితేజ చాంబర్లు ఉన్న కుర్చీలను , కిటికీని ధ్వంసం చేశారు. అంతేకాకుండా శ్రీ చైతన్య స్కూల్లో అనుమతి లేకుండా గత ఆరు నెలలుగా 8.9.10 తరగతులకు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారని, అంతే కాకుండా స్కూలుకు సరైన గ్రౌండ్ లేదని, బస్సులకు పర్మిషన్ లేదని, బస్సులకు కనీసం నెంబర్ లేకుండా నడిపిస్తున్నారని, వచ్చే నెలలో 10 వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయని విద్యాశాఖ అధికారులు ఎంఈఓ, డీఈవో లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సంవత్సరానికి ఒక విద్యార్థి దగ్గర 40 వేల నుండి 60 వేల రూపాయల వరకు వసూలు చేయడం తోపాటు శ్రీ చైతన్య స్కూలుకు పరిమిషన్ తీసుకోవాలని బాధ్యత మర్చిపోతున్నారని. దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి శ్రీ చైతన్య హైస్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని, పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి బస్సులను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాష్ట్ర రోకలు చేస్తామని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా పాఠశాల నడిపిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఎంఈఓ ఎల్లయ్య కు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి 8.9 తరగతులను సీజ్ చేశారు.