డ్వాక్రా గ్రూప్ లీడర్ రూ.60 లక్షల టోకర..?
— జిల్లా కేంద్రంలో ఖంగుతిన్న సంఘం సభ్యులు
— పోలిస్ స్టేషన్ లో పిర్యాదు..?

నిజామాబాద్, జనవరి 09 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా సంఘం లీడర్ సుశీల రూ.60 లక్షల రూపాయల టోకర వేసింది.? ఖిల్లా ప్రాంతంనకు చెందిన మహిళా సంఘం గ్రూప్ సభ్యుల వద్ద రూ. 54 లక్షల రూపాయలతో పాటు గ్రూప్ కు సంబంధించి రూ. 4.60 లక్షలు,గ్రామ సమాఖ్య నుంచి రూ.2.50 లక్షల రూపాయలతో పరారైనట్లు సంఘం సభ్యులు పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. వారం రోజులుగా ఆమె ఇంటికి తాళం ఉండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. సదరు మహిళా భర్త ఆర్టిఓ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.