ఎడపల్లి దౌర్ గంగారెడ్డి పదవి విరమణ
ఎడపల్లి, ఆగస్టు 31( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దౌర్ర్ గంగారెడ్డి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సుదీర్ఘ 40 సంవత్సరాల కాలం పాటు ఎక్సైజ్ శాఖ (అక్బరీ).లో 13 నవంబర్ 1985 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగ ప్రస్తావనం అటెండర్గా నియమితులయ్యారు.ఆయన ఉద్యోగ వృత్త పని తీరును బట్టి కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు.ఉమ్మడి జిల్లాలోని ఆయా డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అంకితభావంతో నిధులు నిర్వహించారు.అదే శాఖలో గంగారెడ్డికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులను ఆశాఖ అధికారులు కల్పించారు.అప్పటినుండి ఆయన ఆ శాఖకు విశిష్ట సేవలు అందిస్తూ అధికారుల మన్నలను.పొందారు. ఈనెల 31 ఆదివారంతో పదవి విరమణ కాలం పూర్తి కావడంతో, ఎక్సైజ్ శాఖ జిల్లా సూపర్డెంట్ మల్లారెడ్డితో పాటుఆశాఖ సిఐ, ఎస్ఐ, సిబ్బంది, పదవి విరమణ పొందిన గంగారెడ్డిని బోధన్, సాలూర చెక్పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలోఆయనకు ఘనంగా సన్మానించి, జ్ఞాపకరణ అందిస్తూ ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఎడపల్లి గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు పదవి విరమణ పొందిన దౌర్ గంగారెడ్డిని ఘనంగా సన్మానించి ఆయన ఆశాఖకు అందించిన సేవలను కొనియాడుతూ ప్రశంసిస్తూ శాలవలతో ఘనంగాసన్మానించి జ్ఞాపకాలను అందజశారు.ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు, మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు డల్ల సురేష్, మచ్కూర్ గంగాధర్, మైబూబ్, కందునూరి గంగ శంకర్, అభినయ్, యాసాడ రాజ్కుమార్,తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు.