ఇందూరులో తొలి శ్రీ వారాహి దేవి ఆలయం
సెప్టెంబర్ 22న శోభాయాత్ర
నిజామాబాద్, సెప్టెంబర్ 21 ( లోకంతీరు ) :
నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు నగరంలో ప్రప్రథమంగా శ్రీ వారాహి దేవి ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి పంచలోహ నూతన విగ్రహాన్ని అమ్మవెంచర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రత్యేక శోభాయాత్రగా తీసుకురానున్నారు.సప్టెంబర్ 22, 2025 (సోమవారం) సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ తెలిపింది.భక్తజనులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారి సేవలో తరించవలసిందిగా ఆలయ కమిటీ అధ్యక్షులు మంచాల జ్ఞానేందర్ పిలుపునిచ్చారు.