విదేశాలకు పంపిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు

కామారెడ్డి జిల్లా/ రాజంపేట , నవంబర్ 01 ( లోకంతీరు ) : జిల్లాలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన గౌడ మల్లేశం గత సంవత్సరం ముగ్గురు వ్యక్తులను విదేశాలకు పంపిస్తానని ఒక లక్షా ఇరవై వేల రూపాయలు తీసుకొని పారిపోయినట్లు రాజంపేట పోలీసు స్టేషన్లో బాధితులు గత సం. డిసెంబర్ 2023 లో పిర్యాదు చేసారు. బాధితుడు పేరు మార్చుకొని కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఉన్నట్లు గుర్తించి రాజంపేట పోలీసులు గురువారం అదుపులోకి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. బాధితున్ని అదుపులోకి తీసుకోవడానికి కృషి చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్, రాజేష్, రవీందర్ ను ఎస్సై పుష్ప రాజ్ అభినందించారు.