భాధితునికి ఎల్ ఓ సి అందజేత

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ .రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుండడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రెండు లక్షల రూపాయల (2,00,000) ఎల్ఓసి ని అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.