అంబులెన్స్ వాహనంలో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

ఎడపల్లి , డిసెంబర్ 07 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం ఏ ఆర్ పి క్యాంప్ కు చెందిన మీనకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు అంబులెన్స్ సిబ్బంది ఆమెను నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో జానకంపేట వద్ద ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో సిబ్బంది అంబులెన్స్ లో సుఖ ప్రవసవం చేశారు అనంతరం తల్లి బిడ్డను నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు 108 అంబులెన్స్ సిబ్బందికి గ్రామస్తులు అభినందించారు