ఆర్థిక సహాయం అందజేస్తున్న జ్యోతి ఫౌండేషన్
![]()
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : వేల్పూర్ మండలం కుకునూరు గ్రామానికి చెందిన ఆరోగ్య పరిస్థితి కానీ సంవత్సరాల నుండి ఆరోగ్య వ్యాధితో బాధపడుతున్న నవనీత ఆమె కూతురు ఆరాధ్య మంచాన బారిన పడటంతో ఆమె తల్లిదండ్రులు మీడియా ద్వారా ముందుకు వచ్చి మా బిడ్డను కాపాడండి అని చెప్పడంతో అంకం జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న నవనీత కు వంట సరుకులు తో పాటు 25 కిలోల బియ్యం రాగి జొన్న నూనె పల్లి పట్టిలు మంగళవారం అందజేశారు. సహాయాన్నిఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నందుకు ఆమె తల్లిదండ్రులతో పాటు గ్రామ ప్రజల కుటుంబానికి ఇంతటి ఆర్థిక సహాయం అందించిన వారిని ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్డ్ సంస్థ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లావణ్య, అంకం జ్యోతి ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.
