అమరవీరుల ఆశయ సాధనకు పోరాడుదాం
– సిపిఐ ఎం ఎల్ మాసలైన్ పార్టీ
ఎడపల్లి, నవంబర్ 07 ( లోకంతీరు ) : జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ….100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్రలో స్వాతంత్రియ సాధన కోసం లక్షలాదిమంది ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. డీవీకే కృష్ణన్న. కామ్రేడ్ యాదగిరి. రాయల. రవన్న. రాయలచంద్రశేఖర్.శావలం సాయిలు అన్న పిట్ల ఎల్లన్న కుమారస్వామి. పడాల రాములు.భూమి,భక్తి విముక్తి కోసం పోరాడారు కొన్ని ఫలితాలు సాధించుకున్నారు ఆ క్రమంలోనే దేశానికి స్వతంత్రం వచ్చిందని కానీ ఆ ఫలితాలను దేశంలోని కొద్దిమందిగా ఉన్న పెట్టుబడిదారులు, దోపిడీదారులు స్వార్థపరులు అనుభవించడం ఇది బాధాకరమైన విషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న దేశంలోని సమస్యలు ముఖ్యంగా రైతు ,కార్మిక , యువజన పరిష్కారం కాలేదు తమ హక్కుల కోసం రైతులు రైతు కూలీలు అందరు ఐకమత్యమై ఉద్యమంలో పాల్గొని భవిష్యత్తు ఉద్యమాలకు సహకరిస్తారని కోరడమైనది ఇందులో సిపిఐ ఎంఎల్. ప్రజా పందా మాస్ లైన్. బోధన్ డివిజన్ నాయకులు. పుట్టి నాగన్న. పార్వతి రాజేశ్వర్. సుల్తాన్ సాయిలు. షేక్ నసీర్. సిద్ధ పోశెటి ఎడపల్లి.మండల నాయకులు శ్రీ పతి మల్లేష్. కాషా రవి, కొండంగల సుదర్శన్ , పశువుల గోపాల్., కొండ్ర భూమయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.