జిల్లా వ్యాప్తంగా ఆర్టీవో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు



నిజామాబాద్ , నవంబర్ 22 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీవో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రోడ్డు రవాణా సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది భాగాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వాహనాలను పరిశీలించి వాటియొక్క సంబంధించిన పాత్రలను పరిశీలించి సరిగా పత్రాలు లేని అన్ని రకాల వాహనాలను అపరాధ రుసుము వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు. అనుమతులు లేనివి ఇతర వాహనాలను పరిశీలించి యాక్సిడెంట్లో నియంత్రణలో భాగంగా తనిఖీలు చేపట్టామన్నారు.