5.1 కిలోల గంజాయి పట్టివేత

నిజామాబాద్, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) : ఈ రోజు మధ్యాహ్నం ఎస్ హెచ్ ఓ నిజామాబాద్ టీం ట్రైన్ చెకింగ్లో భాగంగా సంబల్పూర్ టు నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ నందు అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్ కు చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్ లను అరెస్టు చేసి వారి నుండి 5.1 కిలోల గంజాయి మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఇట్టి తనిఖీలు భాగంగా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ. గంగాధర్, మల్లేష్ ట్రైనీ ఏ ఈ ఎస్ గాయత్రి మరియు కానిస్టేబుల్స్ దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొనడం జరిగింది.