సీఎం పర్యటన అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే
-
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

నిజామాబాద్ రూరల్ , ఆగష్టు 23 ( లోకంతీరు న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరోపించారు.ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడార.సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే ముమ్మాటికి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే అని అన్నారు.దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని భయపడి బీజేపీ పన్నిన రాజకీయ కుట్రగా దీనిని అభివర్ణించారు.2047 రైజింగ్ తెలంగాణ దిశగా బృహత్తరమైన ఆలోచనతో తెలంగాణ ముందుకు వెళ్తుంటే ఓర్వలేక బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు.