ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సురేష్ గౌడ్ కు గురుబ్రహ్మ అవార్డు
ఎడపల్లి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెపూల సురేష్ గౌడ్ ఉత్తమ సేవలు అందించినందుకుగాను, శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో’ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ‘పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఎడపల్లి శ్రీ మాధవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెపూల సురేష్ గౌడ్కు లోక్ సత్తా వ్యవస్థాప అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, ఎం .సురేష్ గౌడ్ ను గురుబ్రహ్మ అవార్డుతో ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు.భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి, అధికారుల, ప్రజల ఆగరా అభిమానాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.శ్రీ మాధవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెపూల సురేష్ గౌడ్, అట్టడుగు స్థాయి నుండి కష్టపడుతూఎన్నో ఓడుదో డుకులను ఎదుర్కొని ఈస్థాయిలో నిలవడం ధరించదగ్గ విషయమని అభినందించారు. కార్యక్రమంలో అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.