స్వాగత సభను విజయవంతం చేయాలి
ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు
ఎడపల్లి, నవంబర్ 12 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 13 గురువారం రోజున ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారునిగా నియమితులైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ లో సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు తెలిపారు ఈ సన్మాన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన తెలిపారు.