ఎడపల్లి మండలంలో చీరల పంపిణీ

ఎడపల్లి, నవంబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన చీరలను గ్రామాలలోని మహిళలకు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయ ఆవరణలో ఎడపల్లి గ్రామ మహిళలకు సీసీ సాయిలు, వివోఏలు లత, గాయత్రితో పాటు ఇతరులు చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కాగా ఎడపల్లి మండలంకు సంబంధించి 12 వేల120 రావడం జరిగిందని వాటిని అన్ని గ్రామాలలో గల మహిళలకు అందించడం జరుగుతుందని ఎడపల్లి సీసీ సాయిలు వివరించారు.