ఇసుక ట్రాలీ ఆటో ఢీకొని వ్యక్తి మృతి

ఎడపల్లి , డిసెంబర్ 24 ( లోకంతీరు ) : సాలూర మండలం సాలుర క్యాంప్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది హూన్సగ్రామానికి చెందిన ముద్ద రాజు ద్విచక్ర వాహనంపై బోధన్ వైపు వెళుతుండగా. ఇసుక ఖాళీ చేసి అతివేగంతో వస్తున్న ట్రాలీ ఆటో ఆయనను బలంగా ఢీ కొట్టింది తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి. అక్కడినుండి నిజామాబాద్ ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవలే కల్దుర్కి వద్ద జరిగిన ప్రమాదం మరువక ముందే మరో మరణం సంభవించడంతో స్థానికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమ ఇసుక రవాణా. అతివేగం. మైనర్ల డ్రైవింగ్ పేచ్చ రీల్లిపోతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు. రెవెన్యూ యంత్రాంగం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.