జిల్లాలో జోరుగా కల్తీకల్లు విక్రయాలు…..
. పట్టించుకోని అధికారులు…..
. మత్తుకు బానిస అవుతున్న యువత….
కామారెడ్డి జిల్లా , జనవరి 25 (లోకం తీరు ) :
11

కామారెడ్డి జిల్లా లో పలు చోట్ల జోరుగా కల్తీకల్లు అమ్ముతున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదు యధేచ్చగా కల్తీకల్లు అమ్ముతూ కాసులు పోగేస్తున్నారు.కల్తీ కళ్ళు మత్తుకు బానిసైన యువత చుట్టుపక్కల కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి రోజుకు వందలది మంది గ్రామంల లో కల్తీ కళ్ళు సేవిస్తున్నారు.కల్తీకల్లుకు బానిసైన యువకులు కళ్ళు సేవించనిదే దినం గడవలేని పరిస్థితి మండలంలో నెలకొంది.ఇంతజరుగుతున్నప్పటికిని సంబంధిత అధికారులు పట్టించు కోవడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.నీళ్లతో కల్తీకల్లు తయారు చేస్తున్నారు. చెట్ల ద్వారా వచ్చే కల్లు అనుకోని ప్రజలు భ్రమలో ఒకటి నుండి రెండు సీసాలు తగగానే మత్తు మాయాలోకంలోకి వెళ్తున్నారు.రోగాల బారిన పడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు డిపోలపై నిఘా పెట్టి ప్రజలను మత్తులోకి వెళ్లకుండా కల్లు కలపడంలో మోతాదుకు మించి మత్తు వేయకుండా చూడాలని ప్రజల ఆరోగ్యం కాపాడాలని వారు కోరుతున్నారు.అధికారులు డిపోలపై దాడులు చేసి శుభ్రత పాటించని కల్లు డిపోలను సీజ్ చేయాలని, వాటికి లైసెన్సు ఉందా లేదా అని కూడా ఖచ్చితంగా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.