గల్ఫ్ దేశంలో చాకిర్యాల్ వాసి మృతి
– మృత దేహాన్ని అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి చేరిక
– అంబులెన్సు సౌకర్యం కల్పించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామానికి చెందిన మండోజి రాజేశ్వర్ పొట్టకూటి కోసం గల్ఫ్ దేశం దుబాయ్ వెళ్లి అక్కడ దురదృష్టవశాత్తు మరణించారు. మృతదేహం గల్ఫ్ నుండి స్వదేశానికి రావడానికి సహాయ సహకారాలు అందించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్వగ్రామం చాకిర్యాల్ చేరడానికి ప్రభుత్వం తరఫున ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కల్పించరు,
ఈ సందర్భంగా గల్ఫ్ దేశంలో మరణించిన రాజేశ్వర్ మృతి పట్ల ముత్యాల సునీల్ కుమార్ సంతాపాన్ని తెలిపారు.