జైతాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం మొదటి వార్షికోత్సవం

ఎడపల్లి , నవంబర్ 21 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో శుక్రవారం శ్రీ మహాలక్ష్మి ఆలయం మొదటి వార్షికోత్స వాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు ,భక్తులు, గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం,కార్యక్రమం నిర్వహించారు .అనంతరం గణపతి పూజ, ఆలయ ప్రాంగణం లో హోమం నిర్వహించారు. కుంకుమ పూజా, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాయిరెడ్డి, కనకయ్య, రాజాశేఖర్, రాజ్కుమార్,చంద్రం,నర్సయ్య, రాజారాం,తో పాటుగ్రామపెద్దలు, మహిళలు,యువకులు,తదితరులు పాల్గొన్నారు.