త్రిలింగ రామేశ్వర ఆలయంలో మాజీ జెడ్పిటిసి ప్రత్యేక పూజలు

నాగిరెడ్డిపేట్, నవంబర్ 23(లోకంతీరు): నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గ్రామంలోగల మహిమాన్విత త్రిలింగ రామేశ్వర దేవాలయాన్ని శనివారం స్థానిక మాజీ జెడ్పిటిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శ్రీరామ లక్ష్మణులు ఆంజనేయుడు స్థాపించిన శివలింగాలను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని ఆయన త్రిలింగ రామేశ్వరాలయ చరిత్రను వివరించారు కార్తీక మాసంలో శ్రీలింగ శ్రీ లింగ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు శ్రీనివాస్ ఆలయ పురోహితులు మల్లికార్జున్ తోపాటు తదితర గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు