ప్రథమ వార్షికోత్సవం విజయవంతం చేయండి
– జనరల్ సెక్రటరీ మామిళ్ళ రాజు


నిజామాబాద్ , నవంబర్ 23(లోకంతీరు) : తెలంగాణ మాజీ కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమ సంఘము( సి ఆర్ పి ఎఫ్ బి ఎస్ ఎఫ్ .సి ఐ ఎస్ ఎఫ్. ఎస్ఎస్బి .ఐటిబిపి .అస్సాం రైఫిల్స్.) ప్రథమ వార్షికోత్సవం విజయవంతం చేయాలని చేయడానికి CAPF. సీఏపి ఎఫ్(సెంట్రల్ ఆర్మేడ్ పోలీసు ఫోర్స్) జవాన్లు తరలి రావాలని స్టేట్ జనరల్ సెక్రెటరీ మామిళ్ల రాజు తెలిపారు . ఆదివారం రోజున బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం ముఖ్య సలహాదారులు వేం నరేందర్ పాల్గొంటారని అన్నారు. రాష్ట్రంలో నివసిస్తున్న మాజీ పారా మిలటరీ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర సాయుధ విశ్రాంతి పోలీసు బలగాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకై ఉండాలని ఈ ఒక్క అసోసియేషన్ నిర్మించడం జరిగిందన్నారు.