నేడే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎడపల్లికి రాక
– ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు

ఎడపల్లి, మే 05 ( లోకంతీరు) : ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి మండల పరిధిలోని సాఠాపూర్ గేట్ వద్దగల డి ఏ ఏమ్ ఫంక్షన్ హాల్లో జరిగే బోధ న్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య సమావేశానికి నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హాజరవుతున్నారని ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు తెలిపారు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బాల్కర్ వెంకట్ గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ తిరుపతి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు కార్యదర్శి తో పాటు కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి బోధన్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు తెలిపారు