ఎడపల్లి మండలంలో భారీ వర్షం ప్రయాణికులకు కొంత ఇబ్బంది

ఎడపల్లి, జూన్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం లోబుధవారంరాత్రి నుండి గురువారం తెల్లవారుజామువరకు కురిసిన భారీ వర్షానికి ఎడపల్లి మండలం లో 82శాతం వర్ష పాఠం నమోదు అయినట్లుతాహాసిల్ధార్ కార్యలయ(ఏ యస్ వో)ఇందు తెలిపారుభారీ వర్షo కురవడంతో ఈదురుగాలుల ప్రభావం ప్రజలు అప్రమత్తమయ్యారు. భారీ వర్షానికి పురాతన ఇల్లలోని కి వర్షపు నీరు చేరుకోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు నిద్రపోలేకపోయారు. మండలం లో అటవీ గుట్ట ప్రాంతాల ఎగువ నుండి వర్షపు నీరంతా దిగువ స్థాయికి చేరడంతో రైతులు నాటిన పంట పొలాలు వారిపై నీట మునిగాయిప్రధాన రోడ్లపై నీరు ప్రవహిస్తున్నాడంతో రాకపోకలకు ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారుమంగళ్ పహాడ్ ప్రధాన రహదారి వెంట నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు వీరితో పాటు రైతులు వారి నాట్లు వేయడం వలన రోడ్ల వెంట కూలీలతో పాటు జనాలు రాకపోకలు సాగిస్తున్నారుఏది ఏమైనా బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి ఓపక్క రైతన్నల హర్షం వ్యక్తం చేస్తుండగా మరోపక్క పురాతన ఇండ్లు ఉన్న ప్రజలు భయాందోళన గురయ్యారు