ఎడపల్లి , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
ఎడపల్లి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ గారి 375 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది గౌడ సంఘ పెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి అని అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని గౌడ కులస్తులు తెలిపారు జయంతి సందర్భంగా సోమవారం రేణుక ఎల్లమ్మ మాత ఆలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి (చిత్రపటానికి) గౌడ కులస్తులుపూలమాలలు వేసి నివాళులర్పించి వారు మాట్లాడుతూ పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపు కోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.