
అధికారులతో సందర్చించిన ఎస్సి,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డబస్తి లోని 21వార్డ్ లో ఇటీవల దళితులు ప్రభుత్వస్థలం లో నిర్మించుకున్న వినాయక మండపం గద్దెని అధికారులు కూల్చివేయడంతో బస్తి దళితులు ఎస్సి,ఎస్టీ కమిషన్ కి ఇచ్చిన ఫిర్యాదుమేరకు సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ,కమిషన్ సభ్యులు శ్రీ రేణికుంట్ల ప్రవీణ్,కుర్సం నీలాదేవి ,జిల్లా శంకర్ , రాంబాబు నాయక్ ,వినాయక మండపాన్ని స్వయంగా సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ ,ఎమ్మార్వో కృష్ణ,ఏసిపి రవికుమార్ ర్లకు ప్రభుత్వం స్థలంలో నిర్మించే వినాయక మండపాన్ని భవిష్యత్తులో ప్రభుత్వానికి అవసరనిమిత్తం ఉపయోగించుకోవచ్చని, మీకు బస్తి దళితులు వినతిపత్రం ఇచ్చిన మేరకు మండప నిర్మాణాన్ని అడ్డుకోవద్దని ఎస్సి,ఎస్టీ కమిషన్ సూచించడం జరిగింది.అక్కడికి వచ్చిన ఎస్సి, ఎస్టీ కమిషన్ కి ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలకు సంబందించిన సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.