ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ
👉ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఇంటి వద్ద ముగ్గు వేసి మార్కింగ్
👉 డివిజన్ అధ్యక్షులు కందికంటి నరేందర్ గౌడ్

నిజామాబాద్ అర్బన్ , జూన్ 27 ( లోకంతీరు ) :నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్ కు చెందిన అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వారికి సంబంధించిన స్టలాల్లో శుక్రవారం ముగ్గు వేసి మార్కింగ్ చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కందికంటి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. డివిజన్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయన్నారు.