బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎడపల్లి మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో సన్మానం
ఎడపల్లి, సెప్టెంబర్ 08 ( లోకంతీరు ) :
ఎడపల్లి మండల పాత్రికేయులు సోమవారం బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం నూతనంగా ఎన్నికైన మండల ప్రెస్ క్లబ్ సమాచారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ను ఎడపల్లి మండలం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులు ఆయనను ఘనంగాసన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులను అభినందించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో అధ్యక్షులు కదం ప్రకాష్ రావు, క్లబ్ బాధ్యులు జగన్మోహన్, జక్కం రాజ్ కుమార్, శేఖర్ గౌడ్, సునీల్, రవికుమార్, విజయ్ గౌడ్, తదితరులు ఉన్నారు.