దుబ్బ తండ సర్పంచ్ అభ్యర్థిగా మాంగ్య నామినేషన్

ఎడపల్లి , నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల పరిధిలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది శుక్రవారం ఎడపల్లి మండలం దుబ్బ తాండకు చెందిన పి మాంగ్య సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ ను అధికారుల సమక్షంలో ఎమ్మెస్సీ ఫారం పంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు నామినేషన్ సమర్పించిన అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యం అని ప్రజలు ఇచ్చే విశ్వాసం మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.