నిజామాబాదులో హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలు
. కానిస్టేబుల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఐ.జి.పి,
. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐ.పీ.ఎస్





నిజామాబాద్, అక్టోబర్ 18 ( లోకంతీరు ) : నిజామాబాదులో శుక్రవారం రాత్రి హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ఈ. ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం టౌన్ 3 పరిదిలోని తన స్వగృహం న్యూ బ్యాంకు కాలనీ లో నివాళులు అర్పించారు.ఇట్టి అంత్యక్రియలలో ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., మల్టీ జోన్ 1, ఐజిపి నార్త్ తెలంగాణ, హైదరాబాద్ మరియు నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐ. పి. ఎస్., అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అతనకు డిసిపి ( ఎ. ఆర్ ) రామచంద్ర రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, CTC , CCS ఏసీపీలు , నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధుల మధ్య పోలీస్ శాఖ వారు లాంఛనాలతో అంతిమ యాత్రను నిర్వహించారు.అనంతరం IGP ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.