రెండు రోజులు సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు జాగ్రత్త
ఎడపల్లి నవంబర్ 17 ( లోకంతీరు ) : తెలంగాణలో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేరా తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం వారు తెలిపారు అదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో చలిగాలులు విస్తాయని హెచ్చరించింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి తీవ్రతఅధికంగా పెరిగిపోయింది ఉదయం 9 గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు కావున పెద్ద మనుషులకు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు తెలిపారు.