గొర్రెల, మేకల కోసం ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ

ఎడపల్లి, డిసెంబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టాల నివారణమందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎడపల్లి పశువైద్యాధికారి ప్రమోద్ కుమార్ నిర్వహించారు.ఆరు వేల గొర్రెలకు, వేయి మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.నట్టల నివారణ వల్ల గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయనీ,బరువు పెరుగుతుందనీ, రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ ఆయన అన్నారు.,వారం రోజుల పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలోమహేందర్,సుశాంత్, షఫీ, గొర్రెల, మేకల పెంపకం దారులు యజమానులు తదితరులుపాల్గొన్నారు,