అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా
-
సర్పంచ్ అభ్యర్థి మధస్తు లక్ష్మి

ఎడపల్లి, డిసెంబర్ 06 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి మాధస్తు లక్ష్మి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింట తిరుగుతూ మీ అమూల్యమైన ఓటును పర్సు గుర్తుకే వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శంగా దిద్దుతామన్నారు. ప్రచార కార్యక్రమంలో మాధస్తూ సతీష్ తో పాటు స్థానికులు, మహిళలు ఉన్నారు.