నేడు జానకంపేట్ కు పిట్ల కృష్ణ మహారాజ్ రాక

ఎడపల్లి, డిసెంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో నీ అశోక్ సాగర్ చెరువు కట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న స్వయంభు శివాలయాన్ని సందర్శించేందుకు సోమవారం మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ విచ్చేయనున్నట్లు ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గత సంవత్సరం శివరాత్రి రోజున స్వయంభుగా వెలసిన శివలింగం తో పాటు నందీశ్వర విగ్రహాలు వెలసిన సంగతి తెలిసిందే అయితే గ్రామస్తుల దాతల సహకారంతో విగ్రహాలు వెలసిన పరిసర ప్రాంతంలో నూతన శివాలయం నిర్మితమవుతున్న క్రమంలో ఆలయం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ స్వామి వస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున జానకంపేట శివారులో గల స్వయంభు శివాలయానికి తరలిరావాలని చైర్మన్ కమిటీ సభ్యులు తెలిపారు.