ఖో ఖో పోటీ అండర్ 14 విభాగంలో
రాధాకృష్ణ పాఠశాల విద్యార్తినిల ప్రతిభ
ఒకరు రాష్ట్ర స్థాయిలో ఎంపిక

నిజామాబాద్ ,డిసెంబర్ 27 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఖో ఖో పోటీలు అండర్ 14 విభాగంలో రాధాకృష్ణ పాఠశాల మంచి ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. అంతే కాకుండా కె దుర్గ అనే విద్యార్థినిని రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ , వ్యాయమ ఉపాధ్యాయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ మా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ,రాష్ట్ర స్థాయిలో ,దేశ స్థాయిలో ఎదిగి దేశానికి మంచి పేరు తేవలని అన్నారు.అంతే కాకుండా విద్యార్థులు మానసిక ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైనా విద్యార్థినిని అభినందించారు.