ఈ నెల 3న ఫుడ్ పెస్టివల్……

నిజామాబాద్ , జనవరి 01( లోకంతీరు ) : ఆర్య సమాజం ఇందూరు ఆధ్వర్యంలో నడిచే రాధాకృష్ణ పాఠశాలలో ఈ నెల మూడవ తేదీన ఫుడ్ ఫెస్టివల్ (ఆహార_ పండుగ) ఉదప్యం జరగనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటన లో తెలిపారు.ఈ ఆహార పండుగ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కసాగుతుందన్నారు. ఈ పండుగ విద్యార్థులతోఏర్పాటు చేయడమైనదని , ఈ కార్యక్రమనికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరు హాజరు కావడానికి అవకాశం ఉందన్నారు.ఈ పండుగ విజయవంతం చేయాలని ఆర్య సమాజ కార్యదర్శి శ్రీ చాటి నారాయణ కోరారు. విద్యార్థులు తయారు చేసిన సాత్విక ఆహార పదార్థాలు కొని ఆస్వాదించి ప్రోత్సహిస్తూ సహకరించ వలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు.