Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై ప్రత్యేక దృష్టి…..

0

ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి

– మరమ్మతులపై దృష్టి సారించాలి….

– వచ్చే సమావేశానికల్లా పరిష్కరించాలి….

– హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జులై 15 ( లోకంతీరు న్యూస్  ) : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని ప్రతి విభాగం అధికారులు సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రధానంగా వైద్యులు హాజరు విషయంలో రాజీ పడేది లేదని, ప్రతి ఒక్కరు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రిలో సివిల్ వర్క్ సమస్యలు అనేకంగా నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. చాలా సమయాల్లో ల్యాబ్, ఎక్స్ రే తదితర వాటికోసం వచ్చే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కొందరు కిందిస్థాయి సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి విభాగాధిపతి సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ రోగులకు ఉత్తమమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వచ్చే సమావేశానికల్లా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్రధానంగా పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, మేయర్ కూరగాయల ఉమారాణి, డిఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.