అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత…..

భీంగల్, ఫిబ్రవరి 13 (లోకం తీరు) : ఎవరు ఎన్ని రకాలుగా తనిఖీలు చేస్తున్న అక్రమ బియ్యం రవాణ అరికట్టడం లేదు. అటు పౌరసరఫరాల శాఖ , ఇటు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు వేరువేరుగా దాడులు చేస్తున్న ఎక్కడో ఒకచోట పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి. దానిలో భాగంగా భీంగల్ నుండి ఆర్మూర్ కు అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యంను AP25X9926 వాహనంలో తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వేల్పూర్ రోడ్డు కృషి స్కూల్ సమీపంలో వాహనాన్ని ఆపి డ్రైవర్ను అడుగగా ఇందులో బియ్యం ఉన్నాయని చెప్పడంతో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పిడియస్ బియ్యం ఉండడంతో వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని ఎస్సై హరిబాబు తెలిపారు.