కాంగ్రెస్ పార్టీలో చేరిన నెహ్రు నగర్ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్

ఎడపల్లి , నవంబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం నెహ్రు నగర్ తాజా మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ గులాబీ గూటి నుండి బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గులాబీ పార్టీకి ఎంతో విధేయుడిగా పేరు సంపాదించుకున్న ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో జంప్ కావడం ఎడపల్లి మండలంలో సర్వత్ర చర్చనీయా అంశంగా మారింది ఏది ఏమైనా నెహ్రు నగర్ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హoదన్ మానాల మోహన్ రెడ్డి నెహ్రు నగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.