ఎడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు

ఎడపల్లి , డిసెంబర్ 03 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోబుధవారం ఎన్నికల అధికారులు అధికారికంగా సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు సభ్యల అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఇందులో భాగంగా శంకర్ నాయుడు సర్పంచ్ అభ్యర్థికి టీవీ రిమోట్ గుర్తు రావడంతో ఆయన ఎన్నికల ప్రచారానికి వేగవంతం చేశారుఅలాగే ఎడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగాకందగట్ల రామచందర్ సర్పంచ్ అభ్యర్థికి ఫుట్బాల్ గుర్తు,, కట్కం శంకర్ కు బ్యాట్ గుర్తు, షేక్ జావిద్ బాబాకు లేడీస్ పర్స్ గుర్తు, ఆత్మేల(కార్కాన్) శ్రీనివాస్ కు ఉంగరం గుర్తు, ఐరన్ల రాజుకు కత్తెర గుర్తును అధికారులు కేటాయించారు. సర్పంచ్ పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్ట నున్నారు గెలుపు ఓటమిలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.