నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెడ్ క్రాస్ బృందం

నిజామాబాద్, జనవరి 03 ( లోకంతీరు ) : రెడ్ క్రాస్ నిజామాబాదు జిల్లా శాఖ వారు నూతన సంవత్సర సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు అధ్యక్షతన జిల్లా పాలనాధికారిని ,రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ రాజీవ్ గాంధీ హన్మంతుని అలాగే జిల్లా జడ్జి శ్రీమతి సునీత కుంచాలని , అదనపు పాలనాధికారి శ్రీ అంకిత్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడం జరిగింది .ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ ,కోశాధికారి కరిపె రవిందర్ , పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు