రాఖీ కట్టుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

ఎడపల్లి, ఆగస్టు 10 ( లోకంతీరు ) : నవీపేట్ మండల్ జగ్గారావు పారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి వివరాలు ఇలా ఉన్నాయి మృతుడు బాసర్ కు చెందిన సాయిబాబు (19) పోలీసులు గుర్తించారు అతను నిజామాబాద్ లో ఉంటున్న తన అక్కతో రాఖికట్టించుకొని తిరిగి స్కూటీపై బాసర్ కు వస్తున్న క్రమంలో వేగంగా లారీని ఢీకొట్టాడు దీనితో సాయి బాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు స్కూటీ వెనకాల కూర్చున్న అరవింద్ అనే యువకునికి గాయాలు కాగా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు