35.36.డివిజన్ లలో భార్య భర్తల నామినేషన్

నిజామాబాద్, నవరి 30 ( లోకంతీరు ) : నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చివరి రోజు కావడంతో జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. 35 ,36 డివిజన్ ల నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గా భార్య భర్తలు నామినేషన్ దాఖలు చేశామన్నారు. 35 , డివిజన్ నుండి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గా కరిపే రాజు నామినేషన్ చేయగా 36 వ డివిజన్ నుండి ఆయన సతీమణి జయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని దృష్టిలో పెట్టుకుని కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో పార్వర్డ్ బ్లాక్ నుండి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు.ఈ రెండు డివిజన్ లలో ఎటువంటి కష్టమొచ్చిన మేమందరికి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని అన్నారు .భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు . 35 , 36 డివిజన్ ఓటర్లు మాకు ఒక్క సారి అవకాశం కల్పించాలని వారు కోరారు.