అభివృద్ధి పేరిట గుట్టలు మాయం
నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి

ఎడపల్లి , అక్టోబర్ 24 ( లోకంతీరు ) : ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పేరిట జిల్లాలో గుట్టలు మాయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆరోపించారు శుక్రవారం జిల్లా బిజెపి నాయకులతో కలిసి రూరల్ మండలంలోని మల్కాపూర్ గుండారం శివారు ప్రాంతంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ను కలిసి ఆధారాలు సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ (అన్నా సెట్) , జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్ , ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, భారతీయ జనతా పార్టీ నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.