శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి
ఎడపల్లి, అక్టోబర్ 25 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయి శివ బంధుమిత్రులతో కలిసి స్వామివారిని దర్శించారు కార్తీక మాసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బంధుమిత్రులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించిన సాయి శివ ఈ దేవాలయం అత్యంత పురాతన చరిత్రక క్షేత్రంగా భక్తులకు విశ్వాసానికి నిలయంగా నిలిచిందని ఆలయం ప్రకృతి సౌందర్యంతో నిండిన పవిత్ర ప్రదేశమని ఇక్కడ స్వామివారికి దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల సమయంలో వేలాది భక్తులు ఈ దేవాలయానికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారని పూజారి వారికి తెలిపారు.