ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంటీ మైక్రో బి యాల్ రెసి స్టేన్స్ పై అవగాహన
ఎడపల్లి, నవంబర్ 18 ( లోకంతీరు ) : సాలూర మండల కేంద్రంలోని ప్రాథమికఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూచేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలనీ అప్పుడే ఆంటీ మైక్రో బిఎల్ రెసిడెన్సి వలన దూరంగా ఉండవచ్చని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజ్ కుమార్ అన్నారు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆంటీ మైక్రోబియాల్ రెసి స్టెన్స్ పై అవగాహన కల్పించారు. ఆంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్స్, టీబి, హెచ్ఐవి, ఇతర వ్యాధులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు అచ్చే అవకాశం ఉందని అందుకే ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలని ఆయన అన్నారు, ప్రతి ఒక్కరూ చేతులను సబ్బుతో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలని ఆయన వివరించారు. దీర్ఘ కాలిక వ్యాధులు కూడా దూరంగా ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రాజ్ కుమార్ , శ్రీకాంత్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.