ఎడపల్లి వైకుంఠ ధామము పరిశీలించిన సర్పంచ్

ఎడపల్లి , డిసెంబర్ 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో వైకుంఠధామమును పరిశీలించిన ఎడపల్లి సర్పంచ్ ఉప సర్పంచ్. కార్యదర్శి వార్డ్ సభ్యులు గ్రామస్తుల తో కలిసి సర్పంచ్ కందగట్ల రామచందర్ (అన్నా సెట్) మాట్లాడుతూ స్మశాన వాటికకు వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్మశాన వాటిక చుట్టూ ఎవరైనా భూ కబ్జా చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యదర్శి నాగరాజు గౌడ్ కు తెలిపారు ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.