త్రిపుర సుందరి దేవి అమ్మవారికి కిరీటం అందజేత

ఎడపల్లి , ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి (అమ్మవారికి) గ్రామానికి చెందిన అనగోని అరుణ్ గౌడ్, దిలీప్ రెడ్డి.బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మ వారికి పంచలోహాలతో చీర, కిరీటం ,హస్తములు, త్రిశూలం అమ్మవారికి చేయించి కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి ఆలయ కమిటీ పాలకవర్గం. వేద పండితులచే ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారికి అలంకరించారు. , ఆనగోని అరుణ్ కుమార్ గౌడ్ తో పాటు, దిలీప్ రెడ్డిని అభినందించారు.నిజంగా చాలా అద్భుతం.వారికి, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంగల్ పహాడ్ గ్రామ పెద్దలు, యువకులు, ఆనగోని అరుణ్ కుమార్ గౌడ్, దిలీప్ రెడ్డి ని గ్రామస్తులు అభినందించారు.