Take a fresh look at your lifestyle.

వేడుకగా జీ.జే.సి కోటగిరి వార్షికోత్సవ వేడుకలు…….

0

వేడుకగా జీ.జే.సి కోటగిరి వార్షికోత్సవ వేడుకలు.

త్వరలో పదవీవిరమణ గావించనున్న డీ.ఐ.ఈ.ఓ రఘురాజ్ కు ఘన సన్మానం.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : గవర్నమెంట్ జూనియర్ కళాశాల కోటగిరి వార్షికోత్సవ వేడుకలు బుధవారం వేడుకగా జరిగాయి.ఈ సందర్భంగా త్వరలో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా పదవీవిరమణ పొందనున్న రఘురాజ్ కు జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్స్,కోటగిరి కళాశాల అధ్యాపకులు ఘన సన్మానం చేశారు.ఈ వేడుకలలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు,పాడిన పాటలు ఈ కార్యక్రమానికి ఆకర్షణీయంగా మారాయి.ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతు.కోటగిరి ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పని చేస్తూన్న సమయంలో నిజామాబాద్ జిల్లా డీ.ఐ.ఈ.ఓ ప్రమోషన్ పొంది,నేడు కోటగిరి కళాశాల వార్షికోత్సవ వేదికగా త్వరలో పదవి విరమణ పొందుతున్న రఘురాజ్ కు ఇక్కడి నుండే మొదటి వీడుకోలు సన్మానం జరగడం పట్ల వారు సంతోషాన్నీ వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలను తెలియ జేశారు.విధి నిర్వహణలో ఆయన ఎన్నో సేవలు చేసి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దారని కొనియాడారు.ప్రతి ఒక్క పనిని తన భుజస్కందాల మీద వేసుకొని అంచనాలుగా ఎదిగి త్వరలో డీ.ఐ.ఈ.ఓ పదవి విరమణ పొందుతున్నారని అన్నారు.ఇలాగే భవిష్యత్తులో లోకం రఘురాజ్ కళాశాలలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్,వర్ని జి.జె.సి ప్రిన్సిపాల్ రవికుమార్, భీంగల్ జి.జె.సి ప్రిన్సిపాల్ చిరంజీవి,ధర్పల్లి జి.జె.సి ప్రిన్సిపాల్ రజియోద్దీన్, దేవరాం,సురేష్ బాబు,కళాశాల అధ్యాపకులు,విద్యార్థిని, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.