ఎడపల్లి, ఆగస్టు 18 ( లోకంతీరు ) :
అల్పపీడనం ప్రభావంతో ఎడపల్లి మండలంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో చెరువులు కుంటలు నిండుకుండలా మారాయి మండలంలో 84.2మి మీ వర్షపాతం నమోదయిందని తాసిల్దార్ దత్తాద్రి తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కూలిపోఏ దశలో ఉన్న ఇండ్లలోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు