అంభం గ్రామంలో దొంగతనం

ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసు వివరాలు ఏమనగా ఎడపల్లి మండలం అంభం గ్రామ నివాసులైన ఔసలి వెంకటేశం s/o లక్ష్మణ చారి లక్ష్మణ గారు కామారెడ్డిలో వివాహమునకు హాజరుకాగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంటిలో గల బీరువా తాళమును పగలగొట్టి బీరువాలో గల నాలుగు గ్రాముల బంగారం 20 తులాల వెండి వస్తువులను మరియు బీరువాలో గల 20 వేల రూపాయలను మరియు ఇంకొక బీరువాలో గల పది తులాలు పట్టి గొలుసులు దొంగలించక పోయినారు అని ఫిర్యాదు రాగా ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది.